
తెలుగు సినీ గీతాల్లో స్వతంత్ర భారతావని గురించి ఆంధ్ర దేశ గొప్పతనాన్ని గురించి పల్లవించిన గీతరచయితలెందరో ఉన్నారు. వందేమాతరం అంటూ బంకించంద్ర అందించిన స్ఫూర్తి తెలుగునాట ఎన్నో దేశ భక్తి గీతాలకు నాంది పలికింది. నాటి సంచలన చిత్రం గృహలక్ష్మిలో
(1938) లెండు భారతీయుల్లార..నిద్ర లేవండోయ్.. కల్లు మానండోయ్..కళ్లు తెరవండోయ్.. అంటూ తాగుడుపై సమరశంఖం పూరించాడు సముద్రాల. సంఘం అనే చిత్రంలో భారతవీరకుమారిని నేనే అని తోలేటి వెంకట్రెడ్డి మహిళాభ్యుదయాన్ని నాడే చాటాడు. మరోవైపు 1950 నాటి దేశ దుస్థితిపై జీవితం అనే సినిమాలో ఇదీనా నా దేశం, ఇదేనా నా భారతదేశం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

No comments:
Post a Comment